కొత్త కేసులు 1,031
ABN , First Publish Date - 2021-05-15T05:11:11+05:30 IST
కొత్త కేసులు 1,031
మరో 8 మంది మృతి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా విలయం ఆగట్లేదు. శుక్రవారం ఒక్కరోజే కొత్తగా 1,031 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతిచెందారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 74,510కు చేరింది. మరణాలు అధికారికంగా 850కు పెరిగాయి. ఇంకా 9,987 మంది పాజిటివ్ బాధితులు కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.