10న నగరానికి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ABN , First Publish Date - 2022-07-06T16:30:34+05:30 IST

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 10న బెంగళూరుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేతలను

10న నగరానికి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

బెంగళూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 10న బెంగళూరుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేతలను కలిసి మద్దతు కోరతారు. బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు నిర్మల్‌ కుమార్‌ సురానా నగరంలో మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పలు కీలక పదవులను అలంకరించి అపార అనుభవం గడించిన ఆదివాసి మహిళానేత రాష్ట్రపతిగా భారీ మెజార్టీతో ఎన్నికై చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతో పాటు రాష్ట్ర బీజేపీ ఎంపీలందరితోనూ ముర్ము భేటీ అవుతారన్నారు. కాగా తన బెంగళూరు పర్యటన సందర్భంగా ముర్ము జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముర్ముకు జేడీఎస్‌ కూడా తన మద్దతును ప్రకటించిన సంగతి విదితమే. దక్షిణాదిన బీజేపీకి రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్నారు.

Updated Date - 2022-07-06T16:30:34+05:30 IST