11 జిల్లాల్లో నిల్.. Bengaluruలో అధికం
ABN , First Publish Date - 2021-12-11T17:26:16+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 314మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 339మంది కోలుకున్నారు. 11 జిల్లాల్లో ఒక్క కేసు లేకపోగా
- లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి కొవిడ్ పాజిటివ్
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించిన బులెటిన్ ప్రకారం 314మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 339మంది కోలుకున్నారు. 11 జిల్లాల్లో ఒక్క కేసు లేకపోగా బెంగళూరులో 179మందికి వైరస్ సోకింది. దక్షిణకన్నడ, కొడగులో 26మంది చొప్పున, చిక్కమగళూరు 19, మైసూరు లో 15మందికి ప్రబలింది. మిగిలిన జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. కొవిడ్కు ఇద్దరు మృతిచెందగా వారు బెంగళూరు వాసులే కావడం గమనార్హం. 29 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 7,305మంది చికిత్స పొందుతున్నారు. కాగా లండన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి పాజిటివ్ సోకినట్టు తెలుస్తోంది. బీఐఏఎల్కు వచ్చిన ఈ ఇద్దరు ప్రయాణీకులు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. రెండురోజుల క్రితం జర్మనీ నుంచి వెనుదిరిగి వచ్చిన ఇద్దరికి వైరస్ సోకడంతో వీరికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా విదేశాలనుంచి వచ్చేవారికి విమానాశ్రయంలో పలు ఆంక్షలు విధించిన సంగతి విదితమే.