11 జిల్లాల్లో వందలోపు Covid కేసులు
ABN , First Publish Date - 2022-02-07T17:44:08+05:30 IST
రాష్ట్రంలో రెండునెలల తర్వాత కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల లోపు కేసులు నమోదు కాగా 11 జిల్లాల్లో వందలోపు మందికి వైరస్ ప్రబలింది. ఆదివారం రాష్ట్రంలో 8,425 మందికి పాజిటివ్ ని
బెంగళూరు: రాష్ట్రంలో రెండునెలల తర్వాత కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదివేల లోపు కేసులు నమోదు కాగా 11 జిల్లాల్లో వందలోపు మందికి వైరస్ ప్రబలింది. ఆదివారం రాష్ట్రంలో 8,425 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులోనే 3,822 మంది బాధితులు ఉన్నారు. 19,800 మంది డిశ్చార్జి అయ్యారు. 47 మంది మృతిచెందగా బెంగళూరులో 17 మంది ఉన్నారు. 15 జిల్లాల్లో ఒక్కరు కూడా మృతిచెందలేదు. 30 జిల్లాల్లో 9,7781 మంది చికిత్సలు పొందుతున్నారు. జనవరి రెండోవారం తర్వాత ఐదులక్షల దాకా ఉన్న యాక్టివ్ కేసులు భారీగా తగ్గాయి.