11 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన మోదీ

ABN , First Publish Date - 2022-01-12T23:47:12+05:30 IST

విరుధునగర్, నమక్కల్, ది నిల్‌గిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్టణం, దిండిగుల్, కల్లకురిచి, అరియలూరు, రామంతపురం, క్రిష్ణగిరి జిల్లాల్లో ఈ నూతన మెడికల్ కాలేజీలను నిర్మించారు.

11 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన మోదీ

చెన్నై: తమినాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. బుధవారం నిర్వమించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. వీటితో పాటు చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ అనే కొత్త క్యాంపస్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం మోదీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంపొందించడం, తమిళనాడు ప్రజలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించడం ఆనందంగా ఉంది’’ అని ట్వీట్ చేశారు.


విరుధునగర్, నమక్కల్, ది నిల్‌గిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్టణం, దిండిగుల్, కల్లకురిచి, అరియలూరు, రామంతపురం, క్రిష్ణగిరి జిల్లాల్లో ఈ నూతన మెడికల్ కాలేజీలను నిర్మించారు. ఇక చెన్నైలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ అనే కొత్త క్యాంపస్‌‌ను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం 24 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు.

Updated Date - 2022-01-12T23:47:12+05:30 IST