ఆడుకుంటున్న కుర్రోడు స్టీల్ గ్లాసులో బాంబు పెట్టి పేల్చాడు.. ఆ తరువాత జరిగింది చూసి స్థానికులు షాకయ్యారు!

ABN , First Publish Date - 2021-11-06T15:45:36+05:30 IST

దీపావళి వచ్చిందంలే చాలు పిల్లలు ఎక్కడలేని..

ఆడుకుంటున్న కుర్రోడు స్టీల్ గ్లాసులో బాంబు పెట్టి పేల్చాడు.. ఆ తరువాత జరిగింది చూసి స్థానికులు షాకయ్యారు!

దీపావళి వచ్చిందంలే చాలు పిల్లలు ఎక్కడలేని సందడి చేస్తారు. ఈ పండుగకు ముందు.. తరువాత కూడా పిల్లలు బాణాసంచా కాల్చడంపై ఉత్సాహం చూపిస్తారు. రాజస్థాన్‌లోని బడ్బర్ గ్రామంలో బాణాసంచా కాలుస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. ఘటన వివరాల్లోకి వెళితే చిన్నారులంతా కలసి టపాసులు కాలుస్తూ, ఒక బాంబును స్టీల్ గ్లాసులో పెట్టి పేల్చారు. దీంతో పెద్దశబ్ధంతో బాంబు పేలడంతో పాటు.. ఆ గ్లాసు ముక్కలై ఎగిరిపడింది. 


ఈ గ్లాసుకు సంబంధించిన ముక్క ఒకటి లక్ష్య యాదవ్(11) ఛాతీలోకి దూసుకుపోయింది. వెంటనే లక్ష్య యాదవ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీనిని గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా, దారిలోనే మృతి చెందాడు. మృతుడిని పరిశీలించిన వైద్యులు.. బాలుని ఛాతీలోకి స్టీలు ముక్క దూరిపోవడంతో విపరీతంగా రక్తస్రావం అయ్యిందని, ఫలితంగా మృతి చెందాడని తెలిపారు. ఈ ఉదంతంపై పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు అందలేదు.

Updated Date - 2021-11-06T15:45:36+05:30 IST