శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం

ABN , First Publish Date - 2022-04-13T01:50:23+05:30 IST

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత ఆపన్నహస్తం అందింది.

శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం

కొలంబో : తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పొరుగుదేశం శ్రీలంకకు భారత ఆపన్నహస్తం అందింది. శ్రీలంక నూతన సంవత్సరానికి స్వాగతం పలకనున్న వేళ 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని భారత్ అందించింది. భారత్ ప్రకటించిన 1 బిలియన్ డాలర్ల సాయంలో భాగంగా ఈ సరుకును చేరవేసింది. కాగా ఇదివరకే 16 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందించిందని శ్రీలంకలో ఇండియన్ హైకమిషన్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి ఎల్డోస్ మ్యాథ్యూ పున్నోసీ తెలిపారు. 1 బిలియన్ డాలర్ల సాయానికి అదనంగా ఇంధన కొనుగోలు కోసం మరో 500 మిలియన్ డాలర్ల సాయాన్ని భారత్ ప్రకటించిందని గుర్తుచేశారు. 2,70,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, డీజిల్ ఇదివరకే శ్రీలంక చేరిందని ఆయన ప్రస్తావించారు.


Updated Date - 2022-04-13T01:50:23+05:30 IST