11 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. పక్కింటి ఆంటీ చంపేస్తుందనే భయంతో..

ABN , First Publish Date - 2021-03-10T21:10:37+05:30 IST

నిన్ను చంపేస్తా అంటూ పక్కింటి మహిళతో బెదిరించడంతో భయపడిపోయిన ఓ 11 ఏళ్ల బాలిక అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది.

11 ఏళ్ల బాలిక ఆత్మహత్య.. పక్కింటి ఆంటీ చంపేస్తుందనే భయంతో..

న్యూఢిల్లీ: నిన్ను చంపేస్తా అంటూ పక్కింటి మహిళతో బెదిరించడంతో భయపడిపోయిన ఓ 11 ఏళ్ల బాలిక అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోగల మన్‌ఖర్దు ప్రాంతంలో మార్చి 6న జరిగిన ఈ దారణం తాజాగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి ముందు పదే పదే చెత్త పారేస్తున్న పక్కింటి మహిళతో బాలిక, ఆమె తల్లి తగాదా పడ్డారు. వారి వాగ్వివాదం తారాస్థాయికి చేరిన సందర్భంలో పక్కింటి మహిళ బాలికను చంపేస్తానంటూ బెదిరించింది. దీంతో భయపడిపోయిన బాలిక ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ‘తగాదా సందర్భంగా ఆమె బాలికతో పాటూ ఆమె తల్లిని కూడా దర్భాషలాడింది. ఓకానొక సమయంలో బాలికను ప్రాణాలు తీసేస్తానంటూ బెదిరించింది. దీంతో..ఆ మైనర్ పెద్ద పెట్టున ఏడుపు ప్రారంభించింది. ఇరుగు పొరుగు వారు కల్పించుకుని వారికి నచ్చచెప్పి పంపించారు’ అని బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు ట్రోంబే పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. 


ఈ గొడవ ముగిసాక  బాలిక తల్లి తన బంధువుల ఇంటికి వెళ్లింది. ఈలోపు..తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం అందటంతో ఆమె హుటాహుటీన ఇంటికి తిరిగొచ్చి బాలికను ఆస్పత్రికి తరలించింది. అయితే.. ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంపేస్తానని పొరిగింటి మహిళ బెదిరించడంతో భయపడిపోనయిన తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పక్కింటామె తన బిడ్డను బెదిరిస్తుండగా.. ఇరుగుపొరుగు వారు చూశారని కూడా పేర్కొంది. దీంతో.. పోలీసులు సెక్షన్ 305, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2021-03-10T21:10:37+05:30 IST