12 మందికి కరోనా.. 32 మంది డిశ్చార్జి
ABN , First Publish Date - 2021-01-16T05:45:59+05:30 IST
12 మందికి కరోనా.. 32 మంది డిశ్చార్జి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో శుక్రవారం 12 మందికి కరోనా సోకింది. మరో పాజిటివ్ బాధితుడు చికిత్స పొందుతూ మరణించాడు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 48,297కు పెరిగింది. అధికారికంగా కరోనా మరణాల సంఖ్య 676కు చేరింది. కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాఽధితుల్లో 32 మంది గడిచిన 24 గంటల్లో కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఇంకా 322 మంది చికిత్స పొందుతున్నారు.