12 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

ABN , First Publish Date - 2021-12-22T17:32:20+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం రాజధాని బెంగళూరులోనే అత్యధికంగా ఉంటోంది. మంగళవారం రాష్ట్ర వ్యా ప్తంగా 295 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 204,

12 జిల్లాల్లో Covid కేసులు నిల్‌

                      - బెంగళూరులో అత్యధికం


బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం రాజధాని బెంగళూరులోనే అత్యధికంగా ఉంటోంది. మంగళవారం రాష్ట్ర వ్యా ప్తంగా 295 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా 12 జిల్లాల్లో ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 204, ఉత్తరకన్నడలో 30, మిగిలిన జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. 290 మంది కోలుకోగా ఐదుగురు మృతి చెందారు. కొడగులో ఇద్దరు, మూడు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,074 మంది చికిత్సలు పొందుతుండగా బీదర్‌, యాదగిరిలలో ఒక్క యాక్టివ్‌ కేసు కూడా లేదు. 

Updated Date - 2021-12-22T17:32:20+05:30 IST