కంటికి కనిపించే ఇంటికి చేరేందుకు 120కి.మీ. ప్రయాణం!

ABN , First Publish Date - 2021-11-21T16:12:19+05:30 IST

కంటికి కనిపించే ఇంటికి చేరేందుకు 120కి.మీ. ప్రయాణం!

కంటికి కనిపించే ఇంటికి చేరేందుకు 120కి.మీ. ప్రయాణం!

చిత్తూరు జిల్లా/సదుం : సదుంలో గార్గేయనది ప్రవాహ ఉధృతి గ్రామాన్ని రెండుగా చీల్చేసింది. గ్రామం నడిబొడ్డున ప్రవహించే గార్గేయ నదిపై సుమారు రూ.కోటి ఖర్చుతో నిర్మించిన తాత్కాలిక రోడ్డు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. దీంతో ఇవతల గట్టు నుంచి చూస్తే అవతల కనిపించే జాండ్రపేటలోని ఇంటికి వెళ్లేందుకు ఓ వ్యక్తి సుమారు 120కి.మీ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. జాండ్రపేటకు చెందిన నిసారుద్దీన్‌ సదుంలోని తన అత్తగారింట ఓ శుభకార్యానికి వచ్చాడు. కార్యక్రమం ముగిసే సమయానికి గార్గేయనదిపై నిర్మించిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. నది దాటే మార్గం లేక కల్లూరు, పీలేరు, కలికిరి, మహల్‌, వాల్మీకిపురం, మదనపల్లె, పుంగనూరు, చౌడేపల్లె, సోమల మీదుగా సుమారు 120కి.మీ ప్రయాణం చేసి ఇంటికి చేరాడు. 

Updated Date - 2021-11-21T16:12:19+05:30 IST