జిల్లాకు 12,284 గృహాలు మంజూరు
ABN , First Publish Date - 2021-07-25T06:23:31+05:30 IST
జిల్లాకు మరో 12,284 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, తక్షణమే గ్రౌండిగ్ పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు.
ఒంగోలు (కలక్టరేట్), జూలై 24: జిల్లాకు మరో 12,284 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసిందని, తక్షణమే గ్రౌండిగ్ పనులు చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రవీణ్కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన గృహ నిర్మాణశాఖ, డ్వామా అధికారులతో సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పేదలకు 2,870, గ్రామీణ ప్రాంతాల్లో 9,514 గృహాలు కొత్తగా మంజూరు చేశారన్నారు. ఈ నెల 29 నుంచి 31 వరకు ప్రత్యేక డ్రైవ్ ద్వారా గ్రౌండింగ్ పూర్తిచేయాలని ఆయన చెప్పారు. జేసీ(గృహ నిర్మాణం) కె.ఎస్.విశ్వనాథన్, గృహనిర్మాణ శాఖ ఈఈ శేషుబాబు, డ్వామా పీడీ శీనారెడ్డి పాల్గొన్నారు.