మరో 124 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-03-06T09:25:51+05:30 IST

రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజు కూడా కరోనా కేసులు వంద దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51,660 శాంపిల్స్‌ను పరీక్షించగా..

మరో 124 కరోనా కేసులు

అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరుసగా నాలుగోరోజు కూడా కరోనా కేసులు వంద దాటేశాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 51,660 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 124 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8,90,441కి పెరిగింది. శుక్రవారం చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 30 మందికి వైరస్‌ సోకగా.. కృష్ణాలో 18, గుంటూరులో 16, విశాఖపట్నంలో 13, తూర్పుగోదావరిలో 13, అనంతపురంలో 10 కేసులు నమోదయ్యాయి. తాజాగా అనంతపురంలో కరోనాతో ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాలు 7,172కి చేరాయి.


కొవిడ్‌ టీకా వేయించుకున్న కోట్ల దంపతులు

కర్నూలు (హాస్పటల్‌), మార్చి 5: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, ఆయన సతీమణి సుజాతమ్మ శుక్రవారం కొవిడ్‌ టీకా తీసుకున్నారు.

Updated Date - 2021-03-06T09:25:51+05:30 IST