జంగారెడ్డిపల్లిలో 13 మంది బైండోవర్
ABN , First Publish Date - 2021-04-24T04:16:42+05:30 IST
జంగారెడ్డిపల్లిలో 13 మంది బైండోవర్
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధి జంగారెడ్డిపల్లి గ్రామంలో రెం డు వర్గాలకు చెందిన 13 మందిని శుక్రవారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్ఐ పి.ధర్మేశ్ తెలిపారు. గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు విషయం లో ఇటీవల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని, వివాదాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా జంతుక పర్వతాలు, కృష్ణ, కంబాలపల్లి అ ల్లాజి, జంతుక గణేశ్, జంతుక శ్రీశైలం, జంతుక జంగయ్య, కావలి రమేశ్, జంతుక విజయ్కుమార్, కాటిక సంజీవ, జంతుక ఎల్లయ్య, జంతుక జంగయ్య, కొమ్ము అంజయ్య, బైకని యాదయ్యలను బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఇకపై ఎలాంటి వివాదాలకు కారణమైనా చట్టప్రకారం చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.