కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు

ABN , First Publish Date - 2022-09-27T08:40:40+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి, భీమారం, సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట్‌, నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్‌, మహబూబాబాద్‌ జిల్లాలోని సీరోలు, ఇనుగుర్తి, సిద్దిపేట జిల్లాలోని అక్బర్‌పేట్‌-భూంపల్లి, కుకునూరుపల్లి, కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కౌకుంట్ల, నిజామాబాద్‌ జిల్లాలోని ఆలూర్‌, డొంకేశ్వర్‌, సాలూరా ను మండలాలుగా ప్రకటించింది.

Updated Date - 2022-09-27T08:40:40+05:30 IST