131 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2021-01-24T05:15:47+05:30 IST

131 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

131 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

(ఆంధ్రజ్యోతి,రంగారెడ్డి అర్బన్‌)/షాద్‌నగర్‌అర్బన్‌/ ఇబ్రహీంపట్నం/ (ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శనివారం 131 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్‌ జిల్లాలో 60, వికారాబాద్‌ జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,19,075కి చేరుకుంది. 

షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం డివిజన్లలో..

 షాద్‌నగర్‌ డివిజన్‌లో శనివారం 138 మందికి కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించారు. షాద్‌నగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో పది మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి, నందిగామ పీహెచ్‌సీలో 25 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 162 మందికి కరోనా యాంటీజెన్‌ టెస్టులు నిర్వహించారు. అబ్ధుల్ల్లాపూర్‌మెట్‌లో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌ జిల్లా యాలాలలో రెండు, మర్పల్లిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదైంది.

Updated Date - 2021-01-24T05:15:47+05:30 IST