139 లీటర్ల సారా ధ్వంసం
ABN , First Publish Date - 2021-01-17T05:25:54+05:30 IST
రాజాం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో శనివారం రాత్రి 139 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఏఈఎస్ కేఎస్ రాంబాబు, పట్టణ సీఐ పి.శ్రీని వాసరావు తెలిపారు.
రాజాం: రాజాం ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం పరిధిలో శనివారం రాత్రి 139 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఏఈఎస్ కేఎస్ రాంబాబు, పట్టణ సీఐ పి.శ్రీని వాసరావు తెలిపారు. రాజాంలో 6 కేసులకు సంబంధించి 103 లీటర్లు, రేగిడి మండలంలో 4 కేసులకు సంబంధించి 36 లీటర్లు సారా ధ్వంసం చేసినట్లు చెప్పా రు. నిందితులను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదురుగా హాజరుపరచామన్నారు. ఆయన ఆదేశాల మేరకు సారాను ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో రేగిడి ఎస్ఐ ఆలీ, ఎక్సైజ్ ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.