139 లీటర్ల సారా ధ్వంసం

ABN , First Publish Date - 2021-01-17T05:25:54+05:30 IST

రాజాం ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో శనివారం రాత్రి 139 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఏఈఎస్‌ కేఎస్‌ రాంబాబు, పట్టణ సీఐ పి.శ్రీని వాసరావు తెలిపారు.

139 లీటర్ల సారా ధ్వంసం


రాజాం: రాజాం ఎక్సైజ్‌ సర్కిల్‌ కార్యాలయం పరిధిలో శనివారం రాత్రి 139 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్లు ఏఈఎస్‌  కేఎస్‌ రాంబాబు, పట్టణ సీఐ పి.శ్రీని వాసరావు  తెలిపారు. రాజాంలో 6 కేసులకు  సంబంధించి  103 లీటర్లు, రేగిడి మండలంలో 4 కేసులకు సంబంధించి 36 లీటర్లు సారా ధ్వంసం చేసినట్లు  చెప్పా రు.  నిందితులను జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దర్‌ ఎదురుగా హాజరుపరచామన్నారు.   ఆయన ఆదేశాల మేరకు సారాను ధ్వంసం చేశామన్నారు.  కార్యక్రమంలో రేగిడి ఎస్‌ఐ ఆలీ, ఎక్సైజ్‌ ఎస్‌ఐ, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-01-17T05:25:54+05:30 IST