పలాసలో 14 కిలోల వెండి లభ్యం
ABN , First Publish Date - 2021-03-07T05:14:41+05:30 IST
పలాసలో 14 కిలోల వెండి సామగ్రి పోలీసులకు పట్టుబడింది. మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పలాస-కాశీబుగ్గలోని ప్రధాన రహదారి కూడలిలో పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు.
చెక్పోస్టు వద్ద పట్టుబడిన సామగ్రి
బిల్లులు లేకపోవడంతో సీజ్
పోలీసుల అదుపులో ముగ్గురు గుజరాత్ వాసులు
పలాస,
మార్చి 6: పలాసలో 14 కిలోల వెండి సామగ్రి పోలీసులకు పట్టుబడింది.
మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పలాస-కాశీబుగ్గలోని ప్రధాన రహదారి కూడలిలో
పోలీసులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ సీఐ శంకరరావు ఆధ్వర్యంలో
విస్తృతంగా వాహనాలు తనిఖీ చేశారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గుజరాత్
రాష్ట్రానికి చెందిన వ్యాపారులు జస్వంత్సింగ్, దేవీలాల్సేన్,
బ్రిజ్లారామ్ల వాహనంలో 14 కిలోల వెండి సామగ్రి పట్టుబడింది. సుమారు రూ.10
లక్షల విలువైన ఈ సామగ్రికి సంబంధించి పోలీసులు ఆరా తీశారు. అనకాపల్లి
విజయలక్ష్మి జ్యూయలరీ దుకాణంలో ఈ సామగ్రి కొనుగోలు చేసి.. పలాసలో
విక్రయించేందుకు తీసుకు వస్తున్నామని వ్యాపారులు తెలిపారు. కానీ, వాటికి
సంబంధించిన బిల్లులు మాత్రం వారి వద్ద లేవు. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురినీ
అదుపులోకి తీసుకుని.. వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సీఐ శంకరరావు
తెలిపారు. తహసీల్దార్ ఎల్.మధుసూధనరావు సమక్షంలో వెండి సామగ్రిని సీజ్
చేసి.. శ్రీకాకుళం ప్రభుత్వ ఖజానా కార్యాలయానికి తరలించామన్నారు. ఎన్నికల
నిబంధనల ప్రకారం సక్రమమైన బిల్లులు సమర్పిస్తేనే ఆ సామగ్రిని సంబంధిత
వ్యక్తులకు అప్పగిస్తామని, లేకుంటే ప్రభుత్వానికి జమ చేస్తామని తెలిపారు.