
అమరావతి: ఏపీలో కొత్తగా 1,439 కరోనా కేసులు నమోదు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 20,26,042కి కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 13,964 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 14,624 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి 19,97,454 మంది రికవరీ అయ్యారు. కృష్ణా 4, చిత్తూరు 3, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు.