15 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల అంకుల్ను కత్తితో పొడిచి చంపేసింది.. అసలు కారణమేంటో తెలిసి నివ్వెరపోయిన పోలీసులు..!
ABN , First Publish Date - 2022-06-08T19:21:52+05:30 IST
ఆ బాలిక వయసు 15 ఏళ్లు.. తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.. పక్కింట్లో ఆమె మేనమామ కుటుంబం ఉండేది..
ఆ బాలిక వయసు 15 ఏళ్లు.. తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది.. పక్కింట్లో ఆమె మేనమామ కుటుంబం ఉండేది.. ఆ పదిహేనేళ్ల బాలికతో మేనమామ అసభ్యంగా ప్రవర్తించేవాడు.. అసభ్యకర కామెంట్లు చేసేవాడు.. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వారం రోజుల క్రితం గొడవ జరిగింది.. అయినా ఆ మేనమామ తీరు మారలేదు.. తన సోదరి కూతురిని వేధించడం ఆపలేదు.. సోమవారం రాత్రి కూడా ఆ బాలికతో మేనమామ అసభ్యంగా ప్రవర్తించాడు.. తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక కత్తితో మేనమామను పొడిచి చంపేసింది.
ఇది కూడా చదవండి..
వయసు మీద పడుతున్నా పెళ్లి చేసుకోనివ్వడం లేదని తల్లిపై కోపం.. చివరకు ఆ ఇద్దరు అన్నాదమ్ముళ్లు కలిసి..
మధ్యప్రదేశ్లోని భోపాల్లో టీటీ నగర్ కాలనీలో నివసిస్తున్న 40 ఏళ్ల రామ్నాథ్ అనే వ్యక్తి తన పక్కింట్లో ఉండే సోదరి కూతురిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఆ బాలిక కనిపిస్తే ఆమెపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మేనమామ ప్రవర్తన గురించి ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారిద్దరూ రామ్నాథ్తో వారం రోజుల క్రితం గొడవపడ్డారు. అయినా రామ్నాథ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. సోమవారం రాత్రి కూడా ఆ బాలికను అసభ్యంగా కామెంట్ చేశాడు. దీంతో ఆ బాలిక తన తల్లిదండ్రులను పిలిచి చెప్పింది.
ఆ బాలిక తల్లిదండ్రులు రామ్నాథ్తో గొడవకు దిగారు. అతడిని కొట్టారు. ఆ సమయంలో బాలిక ఇంట్లో నుంచి కత్తి తీసుకువచ్చి మేనమామను పొడిచేసింది. నివ్వెరపోయిన స్థానికులు రామ్నాథ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో రామ్నాథ్ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలికను, ఆమె తలిదండ్రులను అరెస్ట్ చేశారు.