1500 కిలోల గంజాయి స్వాధీనం
ABN , First Publish Date - 2022-05-26T06:26:56+05:30 IST
మండలంలోని వరహాపురం సమీపంలో గంజాయిని తరలిస్తున్న ఓ వ్యాన్ను పోలీసులు గుర్తించారు. వ్యాన్తో సహా 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
చీడికాడ, మే 25 : మండలంలోని వరహాపురం సమీపంలో గంజాయిని తరలిస్తున్న ఓ వ్యాన్ను పోలీసులు గుర్తించారు. వ్యాన్తో సహా 1500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాలివి. మంగళవారం రాత్రి వరహాపురం మీదుగా వస్తున్న ఓ వ్యాన్ భారీ వర్షం కారణంగా బురదలో చిక్కుకుంది. దానిని బయటకు లాగేందుకు ఆ వ్యక్తులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది లేక వాహనాన్ని అక్కడ వదిలి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తాము బుధవారం మధ్యాహ్నం వెళ్లి చూడగా, ఆ వాహనంలో 1500 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించామన్నారు. అనంతరం గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.