దేశంలో కొత్తగా 15,940 corona cases నమోదు
ABN , First Publish Date - 2022-06-25T15:16:05+05:30 IST
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి..
New Delhi : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,940 కరోనా కేసులు(corona cases) నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 12,425 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 91,779 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ 196 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా రికవరీ రేటు 98.58 శాతంగా ఉంది. ప్రస్తుతం వీక్లీ పాజిటివిటీ రేటు 3.30 శాతంగా నమోదైంది.