ఉమ్మడి జిల్లాలో 1,598 కేసులు

ABN , First Publish Date - 2021-05-11T04:31:44+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం 1598 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు.

ఉమ్మడి జిల్లాలో 1,598 కేసులు
వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎత్తుతున్న రైతులు

కరోనాతో చికిత్స పొందుతూ ఏడుగురు మృతి 


మహబూబ్‌నగర్‌, మే 10 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సోమవారం 1598 కరోనా కేసులు నమోదయ్యాయి. చికిత్స పొందుతూ ఏడుగురు మృతి చెందారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 255 కేసులు, ఇద్దరు మృతి చెందారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా 898 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 267 మంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. వీపనగండ్ల మండలం వల్లభాపూర్‌ గ్రామంలో ఒకరు, కొత్తకోట మండలం పామాపురం గ్రామానికి చెందిన 71 సంవత్సరాల వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూలు జిల్లా 1340 పరీక్షలు చేయగా 650 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మహబూ బ్‌నగర్‌ జిల్లాలో 1210 పరీక్షలు చేయగా 287 మందికి నిర్ధారణ అ య్యిం ది. నారాయణపేట జిల్లాలో 730 మందికి పరీ క్షలు చేయగా 139 మందికి నిర్ధారణ అయ్యింది. 


Updated Date - 2021-05-11T04:31:44+05:30 IST