జంబూసవారీ నేపథ్యంలో.. 15న మైసూరులో ట్రాఫిక్‌పై ఆంక్షలు

ABN , First Publish Date - 2021-10-13T16:43:09+05:30 IST

దసరా ఉత్సవాలలో కీలకఘట్టమైన జంబూసవారీ రోజున ఈ నెల 15న మైసూరు నగరం లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించనున్నారు. మైసూరు నగర పోలీస్‌ కమిషనర్‌ డా

జంబూసవారీ నేపథ్యంలో.. 15న మైసూరులో ట్రాఫిక్‌పై ఆంక్షలు

బెంగళూరు: దసరా ఉత్సవాలలో కీలకఘట్టమైన జంబూసవారీ రోజున ఈ నెల 15న మైసూరు నగరం లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించనున్నారు. మైసూరు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ చంద్రగుప్తా నగరంలో మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జంబూసవారీ సాగే మార్గాల్లో బస్సులతో సహా ఇతర అన్ని వాహనాల సంచారాన్ని దారి మళ్లించనున్నారు. ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు.

Updated Date - 2021-10-13T16:43:09+05:30 IST