రూ.17.70 కోట్లు మంజూరు
ABN , First Publish Date - 2022-07-03T06:13:47+05:30 IST
ఉపాధి హామీ పథకం కింద 22 మండలాల్లో నిర్మించిన భవన నిర్మాణాలకు రూ.17.70 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.
ఉపాధి హామీ కింద నిర్మించిన భవనాలకు విడుదల
రేపు గ్రామపంచాయతీలకు జమ
ఒంగోలు(కలెక్టరేట్), జూలై 2: ఉపాధి హామీ పథకం కింద 22 మండలాల్లో నిర్మించిన భవన నిర్మాణాలకు రూ.17.70 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. సీఎస్పురం, చీమకుర్తి, దర్శి, హెచ్ఎంపాడు, కొనకనమిట్ల, కొత్తపట్నం, కురిచేడు, మద్దిపాడు, ఒంగోలు, పామూరు, పెద్దారవీడు, పొదిలి, పుల్లలచెరువు, తాళ్ళూరు, వైపాలెం, పీసీపల్లి, మర్రిపూడి, జరుగుమల్లి, పొన్నలూరు, సింగరాయకొండ, టంగుటూరు, ఎన్జీపాడు మండలాల్లో నిర్మించిన భవనాలకు ఈ నిధులు వచ్చాయన్నారు. వీటిని సోమవారం ఆయా గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మిగిలిన బకాయిలు కూడా ఈనెలలో విడుదలవుతాయని కలెక్టర్ తెలిపారు.