17న విజయవాడలో వ్యాపారుల సమావేశం

ABN , First Publish Date - 2022-08-14T03:06:12+05:30 IST

వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 17వతేదీన విజయవాడలోని ఏ1 కన్వెన్ష్‌న్‌ సెంటర్‌లో ఆ

17న విజయవాడలో వ్యాపారుల సమావేశం
మాట్లాడుతున్న వాసు తదితరులు

కావలి, ఆగస్టు13: వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు  ఈ నెల 17వతేదీన విజయవాడలోని ఏ1 కన్వెన్ష్‌న్‌ సెంటర్‌లో ఆత్మీయ సమావేశం  నిర్వహించనున్నట్లు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తటవర్తి వాసు తెలిపారు. కావలి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో  రాష్ట్ర అధ్యక్షుడు  రాకేష్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశం లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.  మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారులపై జరుగుతున్న దాడులు, వేధింపులు, రకరకాల పన్నుల భారంపై  సమావేశంలో చర్చించనున్నామన్నారు. సమావేశంలో  పట్టణ అధ్యక్షుడు కోట రమేష్‌, ప్రధాన కార్యదర్శి చవల మురళీకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T03:06:12+05:30 IST