దొంగతనానికి పాల్పడిన బాలుడు..

ABN , First Publish Date - 2021-05-08T17:33:52+05:30 IST

వాహన యజమాని మహ్మద్‌ గఫార్‌ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో

దొంగతనానికి పాల్పడిన బాలుడు..

  • జువైనల్‌ హోంకు తరలింపు

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : ద్విచక్ర వాహనాలను దొంగిలించిన బాలుడిని మల్కాజిగిరి పోలీసులు జువైనల్‌ హోంకు తరలించారు. మౌలాలి షఫీనగర్‌కు చెందిన ఒకరు(18) రాఘవేంద్రకాలనీలో ఇంటి వద్ద పార్కు చేసిన ద్విచక్రవాహనం(టీఎస్10ఈఎన్‌4891)  దొంగిలించాడు. వాహన యజమాని మహ్మద్‌ గఫార్‌ మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి ద్విచక్రవాహనాలు(టీఎస్10ఈఎన్‌4891, టీఎస్‌09ఈజీ0172)ను స్వాధీనం చేసుకుని జువైనల్‌ హోంకు తరలించారు. బాలుడిపై పలు పోలీస్‌ స్టేషన్‌లలో కేసులు ఉన్నాయి.

Updated Date - 2021-05-08T17:33:52+05:30 IST