18న రాష్ట్రానికి జేపీ నడ్డా రాక

ABN , First Publish Date - 2022-06-16T16:33:19+05:30 IST

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 18న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలో ప్రధాని పర్యటన జరగనున్న తరుణంలో

18న రాష్ట్రానికి జేపీ నడ్డా రాక

బెంగళూరు, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 18న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలో ప్రధాని పర్యటన జరగనున్న తరుణంలో నడ్డా రాక కుతూహలం రేకెత్తిస్తోంది. గత రెండు నెలల అవధిలో నడ్డా రాష్ట్రానికి రెండోసారి వస్తున్నారు. బెంగళూరు నగర శివారులోని యలహంకలో ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ సదస్సులో పాల్గొనేందుకే నడ్డా వస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించనున్న నడ్డా పలువురు ప్రముఖ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కసరత్తు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈనెల 18న నడ్డా చిత్రదుర్గ మురుఘమఠాన్ని సందర్శిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.  

Updated Date - 2022-06-16T16:33:19+05:30 IST