రేపు వైద్యుల నిరసన

ABN , First Publish Date - 2021-06-17T05:17:47+05:30 IST

దేశవ్యాప్తంగా ఈనెల 18న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ‘స్టాఫ్‌ వైలెన్స్‌.. సేవ్‌ డాక్టర్స్‌’ నినాదంతో నిరసన చేపడుతున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భీమవరం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జి.సూర్యనారాయణరాజు, కా ర్యదర్శి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ యిర్రింకి, కోశాధికారి డాక్టర్‌ వీవీజీ సోమరాజు, డాక్టర్‌ దీప్తి తెలిపారు.

రేపు వైద్యుల నిరసన
సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ సూర్యనారాయణరాజు, తదితరులు

భీమవరం క్రైమ్‌, జూన్‌ 16 :  దేశవ్యాప్తంగా ఈనెల 18న ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ‘స్టాఫ్‌ వైలెన్స్‌.. సేవ్‌ డాక్టర్స్‌’ నినాదంతో నిరసన చేపడుతున్నామని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భీమవరం గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ జి.సూర్యనారాయణరాజు, కా ర్యదర్శి డాక్టర్‌ నరేష్‌కుమార్‌ యిర్రింకి, కోశాధికారి డాక్టర్‌ వీవీజీ సోమరాజు, డాక్టర్‌ దీప్తి తెలిపారు. భీమవరంలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ డాక్టర్లపై జరుగుతున్న భౌతికదాడుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రులపై భౌతిక దాడులను తెగబడిన వారిని త్వరితగతిన శిక్షించాలని అన్నారు. వైద్యులంతా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయాలన్నారు. డాక్టర్‌ అనిల్‌ సుంకర పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:17:47+05:30 IST