Hyderabad: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 19 మందికి జైలు

ABN , First Publish Date - 2022-09-24T13:27:57+05:30 IST

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 19 మందికి జైలు శిక్ష విదించినట్టు రాజేంద్రనగర్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి నజీరుద్దీన్‌ తెలిపారు. శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో

Hyderabad: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 19 మందికి జైలు

హైదరాబాద్/రాజేంద్రనగర్‌: డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో 19 మందికి జైలు శిక్ష విదించినట్టు రాజేంద్రనగర్‌ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి నజీరుద్దీన్‌ తెలిపారు. శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎనిమిది మంది, రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పది మంది, రాయదుర్గం ట్రా ఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకరిని జైలుకు పంపించామన్నా రు. తాగి వాహనాలు నడపడంవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్‌ ధరించాలని, సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. మైనర్‌ బాలురకు వాహనాలు ఇస్తే వారిని కూడా జైలుకు పంపిస్తామన్నారు. 

Updated Date - 2022-09-24T13:27:57+05:30 IST