చదువు కోసం పెద్దమ్మ ఇంటికి చేరిన యువతి.. ఆమెపై ఘాతుకానికి పాల్పడిన సోదరులు.. గర్భం దాల్చిన విషయం పెద్దమ్మకు చెబితే..

ABN , First Publish Date - 2022-02-04T20:56:49+05:30 IST

ఆ యువతి చదువు కోసం పట్నంలో ఉన్న తన పెద్దమ్మ ఇంటికి చేరింది.. అక్కడ ఉండి కాలేజీలో చదువుకోవాలనుకుంది..

చదువు కోసం పెద్దమ్మ ఇంటికి చేరిన యువతి.. ఆమెపై ఘాతుకానికి పాల్పడిన సోదరులు.. గర్భం దాల్చిన విషయం పెద్దమ్మకు చెబితే..

ఆ యువతి చదువు కోసం పట్నంలో ఉన్న తన పెద్దమ్మ ఇంటికి చేరింది.. అక్కడ ఉండి కాలేజీలో చదువుకోవాలనుకుంది.. అయితే పెద్దమ్మ కొడుకుల ఘాతుకానికి బలైంది.. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై పెద్దమ్మ కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు.. రెండేళ్ల పాటు ఆమెతో శారీరక వాంఛ తీర్చుకున్నారు.. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది.. ఆ విషయం పెద్దమ్మకు చెబితే ఆమె సర్ది చెప్పి అబార్షన్ చేయించింది.. తాజాగా ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు సమీపంలోని గంజ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల బాలిక తన పెద్దమ్మ ఇంట్లో ఉండి కాలేజీలో చదువుకుంటోంది. ఒక రోజు ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పెద్దమ్మ ఇద్దరు కొడుకులు, బాధిత యువతికి సోదర వరుసయ్యే యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అలా ఆమెను బెదిరించి రెండేళ్ల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ విషయాన్ని ఆమె పెద్దమ్మకు చెప్పింది. 


ఆ పెద్దమ్మ తన కొడుకులను మందలించకపోగా విషయం బైటకు పొక్కకుండా చూసింది. స్థానిక క్లినిక్‌కు తీసుకెళ్లి అబార్షన్ చేయించింది. ఆ తర్వాత కూడా నిందితుల తీరు మారలేదు. దీంతో ఆ యువతి తాజాగా గంజ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అత్యాచారం గురించి వివరించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి పెద్దమ్మ, ఆమె కొడుకులపై కేసులు నమోదు చేశారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   

Updated Date - 2022-02-04T20:56:49+05:30 IST