తెలంగాణలో కొత్తగా 198 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-12-04T02:14:58+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్
హైదరాబాద్: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. తెలంగాణలో కొత్తగా 198 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. కరోనా నుంచి మరో 153 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎట్ రిస్క్ దేశాల నుంచి తెలంగాణకు 909 మంది వచ్చారు. ఇవాళ ఒక్కరోజే ఎట్ రిస్క్ దేశాల నుంచి 219 మంది తెలంగాణకు వచ్చారు. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇవాళ 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చినవారిలో 13మందికి కరోనా సోకింది. 13మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్కు అధికారులు పంపారు.