NRI మహిళకు ఊహించని షాక్..! బ్యాంకు మేనేజర్ చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-02-25T01:04:58+05:30 IST

భారీ లాభాలు వస్తాయంటూ ఓ ఎన్నారై మహిళను ఉచ్చులోకి లాగిన ఇద్దరు నిందితులు ఆమె నుంచి ఏకంగా 3.5 కోట్లు దోచేశారు.

NRI మహిళకు ఊహించని షాక్..!  బ్యాంకు మేనేజర్ చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: భారీ లాభాలు వస్తాయంటూ ఓ ఎన్నారై మహిళను ఉచ్చులోకి లాగిన ఇద్దరు నిందితులు ఆమె నుంచి ఏకంగా 3.5 కోట్లు దోచేశారు. జరిగిన ఘోరం గురించి ఏడాది తరువాత తెలుసుకున్న ఆమె ఇటీవల ఫిర్యాదు చేయడంతో నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కెనడాలో ఉంటున్న ఆమె ఫిర్యాదు ఆధారంగా ముంబై పోలీసులు రవి జగన్నాథ్, చంద్రమోహన్ మెహ్రోత్రాలను అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని వారు ఎన్నారైని మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు. 


నిందితుల మాటలు నమ్మిన సదరు మహిళ.. గతేడాది ఓ ప్రముఖ బ్యాంకులో అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ఆమె నుంచి డబ్బు తీసుకున్నాక..నిందితులు రెండు రశీదులు కూడా ఇచ్చారు. కాగా..సదరు మహిళ ఈ నెల ఆరంభంలో ఇండియాకు వచ్చి తన పెట్టుబడులు, లాభాల గురించి బ్యాంకులో ఆరా తీయగా.. ఆమె వద్ద ఉన్న రశీదులు నకిలీవని బ్యాంకు మేనేజర్ చెప్పారు. దీంతో.. ఆమె ఒక్కసారిగా దిమ్మెరపోయారు. అనంతరం.. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితులను అరెస్టు చేశారు.

Updated Date - 2022-02-25T01:04:58+05:30 IST