లంచం కేసులో ఇద్దరు బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన సీబీఐ
ABN , First Publish Date - 2021-11-21T03:23:25+05:30 IST
లంచం కేసులో ఇద్దరు బ్యాంకు అధికారులను అరెస్ట్ చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: పుణె, అహ్మదాబాద్లో రూ.30 లక్షల లంచం కేసులో ఇద్దరు బ్యాంకు అధికారులు అరెస్ట్ అయ్యారు. పుణె, అహ్మదాబాద్లకు చెందిన రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను సీబీఐ అరెస్టు చేసింది. ఫిర్యాదుదారుడికి వాల్యుయేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారు.