వేలం జాబితాలో రాష్ట్రానికి చెందిన 2 బొగ్గు బ్లాక్‌లు

ABN , First Publish Date - 2020-07-07T07:27:58+05:30 IST

వేలం జాబితాలో రాష్ట్రానికి చెందిన 2 బొగ్గు బ్లాక్‌లు

వేలం జాబితాలో రాష్ట్రానికి చెందిన 2 బొగ్గు బ్లాక్‌లు

మంచిర్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణలో భాగంగా తెలంగాణలోని రెండు బొగ్గు బ్లాక్‌లను వేలం జాబితాలో చేర్చారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అనిశెట్టిపల్లి, పున్కులచిలక బ్లాక్‌లున్నాయి. అనిశెట్టిపల్లి బ్లాక్‌లో 26.89 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు, పున్కులచిలక బ్లాక్‌లో 4.41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 38.11 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. గతంలో ఈ బ్లాక్‌లను ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌కు కేటాయించినట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. కాగా ఝార్ఖండ్‌ లో 20,  మహారాష్ట్రలో 15, ఒడిశాలో 8, చత్తీ్‌సగఢ్‌లో 15, మధ్యప్రదేశ్‌లో 7, పశ్చిమబెంగాల్‌లో 1 బ్లాక్‌ ప్రైవేటీకరణ జాబితాలో ఉన్నాయి.

Updated Date - 2020-07-07T07:27:58+05:30 IST