బార్‌లోకి వెళ్లేందుకు ఇద్దరు భారతీయుల పచ్చి అబద్ధం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగపూర్ కోర్టు.. ఏ శిక్ష విధించిందంటే..

ABN , First Publish Date - 2022-04-29T16:50:40+05:30 IST

భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బార్‌లోకి వెళ్లేందుకు పచ్చి అబద్ధాలు ఆడారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన సింగపూర్ న్యాయస్థానం.. తీ

బార్‌లోకి వెళ్లేందుకు ఇద్దరు భారతీయుల పచ్చి అబద్ధం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగపూర్ కోర్టు.. ఏ శిక్ష విధించిందంటే..

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బార్‌లోకి వెళ్లేందుకు పచ్చి అబద్ధాలు ఆడారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేశారు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన సింగపూర్ న్యాయస్థానం.. తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి సింగపూర్ సహా ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధించి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సింగపూర్ అక్కడ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే బార్‌లోకి వెళ్లేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈ ఆంక్షలను ఇద్దరు భారతీయులు అతిక్రమించారు. 65ఏళ్ల ఉతెయ కుమార్ సహా మరో భారతీయుడు తాము వ్యాక్సిన్ వేసుకున్నట్టు అబద్ధాలు చెప్పి బార్‌లోకి ప్రవేశించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరు ఐదురోజులపాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 




Updated Date - 2022-04-29T16:50:40+05:30 IST