బెడ్ల విషయంలో అబద్ధాలు.. రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్!

ABN , First Publish Date - 2021-04-19T09:24:09+05:30 IST

ప్రస్తుతం దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు.

బెడ్ల విషయంలో అబద్ధాలు.. రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై ఎఫ్ఐఆర్!

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితిని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు. ఇలా చేయడానికి ప్రయత్నించిన రెండు ఆస్పత్రులపై ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీకి చెందిన రెండు ఆస్పత్రుల్లో బెడ్ల విషయంలో తప్పుడు లెక్కలు చూపినట్లు తేలడంతో ప్రభుత్వ అధికారులు సదరు ఆస్పత్రులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తు సమయంలో కూడా కరోనా పేషెంట్లకు బెడ్లు ఖాళీ లేవని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అయితే దర్యాప్తులో 93 బెడ్ల వరకూ అందుబాటులో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ రెండు ఆస్పత్రులపై పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Updated Date - 2021-04-19T09:24:09+05:30 IST