తిరుపతిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
ABN , First Publish Date - 2020-11-30T18:15:07+05:30 IST
నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న తిరుగుతున్న
తిరుపతి: నగరంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న తిరుగుతున్న ముగ్గురు ఎట్టకేలకు నగర పోలీసులకు చిక్కారు. ఈ ముఠా నుంచి సుమారుగా రూ. 20 లక్షల విలువైన బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు బైక్ దొంగతనాలకు పాల్పడి, వాటిని తక్కువ ధరకు అమ్ముకుని జల్సాలకు అలవాటుపడినట్లు పోలీసులు తెలిపారు.