20 స్థానాలకు Bjp ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన

ABN , First Publish Date - 2021-11-21T18:03:07+05:30 IST

స్థానిక సంస్థల నుంచి విధానపరిషత్‌కు పోటీ చేసే తన అభ్యర్థుల తొలి జాబితాను అధికార బీజేపీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. కుటుంబ రాజకీయాలకు తాము దూరం అంటూనే పలు ఒత్తిళ్ల నేపథ్యంలో

20 స్థానాలకు Bjp ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా ప్రకటన

                     - కుటుంబ రాజకీయాలకు తలొగ్గిన అధిష్ఠానం 


బెంగళూరు: స్థానిక సంస్థల నుంచి విధానపరిషత్‌కు పోటీ చేసే తన అభ్యర్థుల తొలి జాబితాను అధికార బీజేపీ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. కుటుంబ రాజకీయాలకు తాము దూరం అంటూనే పలు ఒత్తిళ్ల నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలు వీటికి తలొగ్గక తప్పలేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌శెట్టర్‌ సోదరుడు ప్రదీప్‌శెట్టర్‌, బీజేపీ ఎమ్మెల్యే అప్పచ్చురంజన్‌ కుమారుడు సుజా కుశాలప్పకు టికెట్లు దక్కాయి. ప్రత్యేక రాజకీయ సమీకరణల నేపథ్యంలోనే వీరికి టికెట్లు కేటాయించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీల్‌ గట్టిగా సమర్థించుకున్నారు. కాగా కొడగులో ప్రస్తుతం అప్పచ్చురంజన్‌ సోదరుడు సునీల్‌ సుబ్రమణి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా జనవరి 5తో ఆయన పదవీకాలం ముగియనుంది. ఈసారి ఆయన బదులుగా మరో సోదరుడు సుజా కుశాలప్పకు టికెట్‌ ఇవ్వడం విశేషం. విధానపరిషత్‌ మాజీ సభాపతి డీహెచ్‌ శంకరమూర్తి కుమారుడు డీఎస్‌ అరుణ్‌కు కూడా ఈ జాబితాలో చోటు దక్కడం విశేషం. ఊహించినట్టే సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కోట శ్రీనివాసపూజారి, ఉపసభాపతి ఎంకే ప్రాణేశ్‌, చీఫ్‌ విప్‌ మహంతేశ్‌ కవటగి మఠలకు మళ్లీ టికెట్లు ఇచ్చారు. జాబితా ఇలా ఉంది. 




Updated Date - 2021-11-21T18:03:07+05:30 IST