పెందుర్తిలో 20 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-05-11T04:47:56+05:30 IST

పెందుర్తిలో 20 ఆక్సిజన్‌ బెడ్లు, రెండు ఆక్సిజన్‌ అంబులెన్సులను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన సొంత నిధులతో సమకూర్చారు. వీటి ఏర్పాటు కోసం సోమవారం అధికారులతో కలసి పెందుర్తి ఉన్నత పాఠశాలలో స్థలాన్ని పరిశీలించారు.

పెందుర్తిలో 20 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు
ఆక్సిజన్‌ బెడ్ల ఏర్పాటు కోసం పెందుర్తి ఉన్నత పాఠశాలలో స్థల పరిశీలన చేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

రెండు ఆక్సిజన్‌ అంబులెన్స్‌లు కూడా..

ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ 

పెందుర్తి, మే 10: పెందుర్తిలో 20 ఆక్సిజన్‌ బెడ్లు, రెండు ఆక్సిజన్‌ అంబులెన్సులను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ తన సొంత నిధులతో సమకూర్చారు. వీటి ఏర్పాటు కోసం సోమవారం అధికారులతో కలసి పెందుర్తి ఉన్నత పాఠశాలలో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ ప్రజల కోసం 20 ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకు ముందు స్థానిక సీహెచ్‌సీని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట జడ్సీ చక్రవర్తి, ఎంపీడీవో మంజులవాణి, తహసీల్దార్‌ పైల రామారావు, వైసీపీ నాయకులు ఎల్‌బీనాయుడు,  జోబుదాసు తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-11T04:47:56+05:30 IST