యమునా నదిలో పడవ మునక యూపీలో 20 మంది దుర్మరణం!
ABN , First Publish Date - 2022-08-12T09:15:59+05:30 IST
యమునా నదిలో పడవ మునిగిన ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 11: యమునా నదిలో పడవ మునిగిన ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లోని బందా నుంచి ఫతేపూర్ వెళ్తున్న పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో పడవలో 40మంది ఉన్నారు. కడపటి వార్తలు అందేసరికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.