20 ఏళ్ల క్రితం పెళ్లి.. 15 ఏళ్ల కిత్రం విడిపోయారు.. రెండ్రోజుల కిందట..!
ABN , First Publish Date - 2021-07-31T16:12:15+05:30 IST
లావణ్యకు ఆనిల్కుమార్తో 20ఏళ్ల క్రితం వివాహమైంది.
హైదరాబాద్ సిటీ/నార్సింగ్ : నార్సింగ్కు చెందిన ఓ మహిళ అదృశ్యమైంది. నార్సింగ్కు చెందిన లావణ్య(41)కు ఆనిల్కుమార్తో 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. 15 ఏళ్ల క్రితం విడిపోయారు. ఆమె సోదరుడి ఇంట్లో ఉంటోంది. ఈమె గురువారం నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం ఎంత వెతికినా లాభం లేకపోవడంతో సోదరుడు నార్సింగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.