మే3 కల్లా బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీలో ఉంటారు : తేజస్వీ సూర్య
ABN , First Publish Date - 2021-03-04T22:12:18+05:30 IST
మే 3న బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీలో ఉంటారని బీజేపీ ఎంపీ, బెంగాల్ ఎన్నికల పర్యవేక్షకుడు ఆదిత్య సూర్య ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లలో
కోల్కతా : మే 3న బీజేపీ అభ్యర్థి సీఎం కుర్చీలో ఉంటారని బీజేపీ ఎంపీ, బెంగాల్ ఎన్నికల పర్యవేక్షకుడు ఆదిత్య సూర్య ధీమా వ్యక్తం చేశారు. 200 సీట్లలో పార్టీ విజయం సాధించి తీరుతుందని పేర్కొన్నారు. ‘‘బెంగాల్లో బీజేపీ 200కు పైగా సీట్లను కైవసం చేసుకుంటుంది. ముఖ్యమంత్రి బెనర్జీకి కౌంట్డౌన్ ప్రారంభమైంది. మే 3 కల్లా బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి సీఎం పదవిలో ఉంటారు.’’ అని తేజస్వీ సూర్య తెలిపారు. కమ్యూనిస్టుల వారసత్వాన్ని మమతా బెనర్జీ మోస్తున్నారని, ఇకపై అలాంటి ఆటలు సాగవని, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.