ఏపీలో కొత్తగా 2,068 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-07-31T00:28:05+05:30 IST

రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్య శాఖ అధికారులు బులెటిన్ విడుదల

ఏపీలో కొత్తగా 2,068 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలో కరోనా తాజా పరిస్థితులపై ఆరోగ్య శాఖ అధికారులు బులెటిన్ విడుదల చేశారు. రాష్ట్రంలో కొత్తగా 2,068 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కరోనాతో 22 మంది మృతి చెందారు. ఏపీలో 19,64,117కి కరోనా కేసులు చేరాయి. మొత్తం 13,354 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 21,198 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 19,29,565 మంది రికవరీ చెందారు. ప్రకాశం 6, కృష్ణా 4, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. నెల్లూరు 2, తూ.గో., శ్రీకాకుళం, విశాఖ, విజయనగరంలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-07-31T00:28:05+05:30 IST