21 జిల్లాల్లో Covid తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-01-30T16:07:11+05:30 IST

రాష్ట్రంలోని 21 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. స్థానిక స్టాన్లీ ప్రభుత్స్పాత్రిలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ వార్డును శనివారం పరిశీలించిన డా.జె.రాధాకృష్ణన్‌

21 జిల్లాల్లో Covid తగ్గుముఖం

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలోని 21 జిల్లాల్లో కరోనా తగ్గుముఖం పట్టిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి డా.జె.రాధాకృష్ణన్‌ తెలిపారు. స్థానిక స్టాన్లీ ప్రభుత్స్పాత్రిలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ వార్డును శనివారం పరిశీలించిన డా.జె.రాధాకృష్ణన్‌ విలేఖరులతో మాట్లాడుతూ, కృష్ణగిరి, సేలం, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌ తదితర జిల్లాల్లో కరోనా నియంత్రణ సవాలుగా ఉందన్నారు. చెన్నై నగరంలోని పలు మండలాల్లో కరోనా తీవ్రత తగ్గిందని తెలిపారు. కొత్త వైరస్‌ వస్తుందంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మరాదని, అధికారికంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


వైగోకు పాజిటివ్‌

పెరంబూర్‌(చెన్నై): ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆయనకు నిర్వహించిన వైద్యపరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో, వైద్యుల సూచనల మేరకు అన్నానగర్‌లో ఉన్న ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నా రని ఆ పార్టీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Updated Date - 2022-01-30T16:07:11+05:30 IST