పెళ్లయిన ఏడాదికే భార్య బలవన్మరణం.. గదిలో దొరికిందో లేఖ.. భర్త, అతడి చెల్లి గురించి ఆమె రాసింది చదివి..

ABN , First Publish Date - 2022-04-26T20:40:44+05:30 IST

ఆమెకు గతేడాది వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టింది.. భర్త కూడా ఆమెను ఆదరంగా చూసుకున్నాడు..

పెళ్లయిన ఏడాదికే భార్య బలవన్మరణం.. గదిలో దొరికిందో లేఖ.. భర్త, అతడి చెల్లి గురించి ఆమె రాసింది చదివి..

ఆమెకు గతేడాది వివాహం జరిగింది.. ఎన్నో ఆశలతో అత్తింట అడుగు పెట్టింది.. భర్త కూడా ఆమెను ఆదరంగా చూసుకున్నాడు.. అయితే భర్త సోదరి, సోదరుడు ఆమెను వేధింపులకు గురి చేశారు.. భర్తతో ఆమెకు విభేదాలు సృష్టించారు.. ఇంటి నుంచి బయటకు గెంటేసేలా చేశారు.. తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.. తన చావుకు మరదలు, మరిది కారణమని సూసైడ్ నోట్‌లో రాసింది. 


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన 21 ఏళ్ల ఆర్తి అనే మహిళకు గతేడాది ఏప్రిల్ 10న సూరజ్ అనే వ్యక్తితో వివాహమైంది. అత్తింట అడుగు పెట్టిన ఆర్తికి భర్త సోదరి, సోదరుడి రూపంలో వేధింపులు ఎదురయ్యాయి. మరదలు సోనా, మరిది ఓం ప్రకాష్ కలిసి ఆర్తిని వేధించారు. తమ అన్నయ్యకు లేని పోని మాటలు చెప్పి ఆర్తి మీద అసహ్యం పుట్టేలా చేశారు. చెల్లి, తమ్ముడు మాటలు విన్న సూరజ్ గత నెలలో ఆర్తిని పుట్టింటికి పంపేశాడు. ఆర్తి తల్లిదండ్రులు బతిమలాడినా తిరిగి తీసుకెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఆర్తి సోమవారం పుట్టింట్లోనే ఆత్మహత్య చేసుకుంది. 


ఆత్మహత్య చేసుకునే ముందు ఓ లేఖ రాసింది. `ఈ ఇంట్లో ఉన్నవాళ్లెవరూ నా చావుకు కారకులు కాదు. నా భర్త సోదరి వల్లే నేను చనిపోతున్నా. ఆమె, ఆమె తమ్ముడు కలిసి నా భర్తతో నాకు విభేదాలు సృష్టించారు. నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. నా చావుకు వాళ్లిద్దరే కారణం. నేను నా భర్తను ఎంతగానో ప్రేమిస్తున్నా. మరణం తర్వాత కూడా అతణ్ని ప్రేమిస్తూనే ఉంటాన`ని లేఖలో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోనా, ఓం ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  

Updated Date - 2022-04-26T20:40:44+05:30 IST