213 కేసులు.. ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-06-22T05:17:57+05:30 IST
213 కేసులు.. ఇద్దరు మృతి
విజయవాడ, ఆంధ్రజ్యోతి : జిల్లాలో కరోనా బారినపడిన మరో ముగ్గురు బాధితులు సోమవారం చనిపోయారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 213 మందికి వైరస్ సోకింది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య అధికారికంగా 1,066కు చేరగా, పాజిటివ్ కేసులు 98,697కు పెరిగాయి. వీరిలో ఇప్పటివరకు 92,864 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకోగా, 4,768 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
జగ్గయ్యపేటలో నలుగురు చిన్నారులకు పాజిటివ్
జగ్గయ్యపేట, జూన్ 21 : జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో సోమవారం నిర్వహించిన 53 ర్యాపిడ్ టెస్టుల్లో 17 మందికి పాజిటివ్ రాగా, అందులో నలుగురు 10 ఏళ్లలోపు పిల్లలు ఉన్నారని వైద్యాధికారులు తెలిపారు. థర్డ్వేవ్ సూచనల నేపథ్యంలో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు జాగ్రత ్తగా ఉండాలని ప్రభుత్వాసుపత్రి ఇన్చార్జి, పిల్లల వైద్య నిపుణుడు వెంకటేశ్వరరావు తెలిపారు.