ఇరు జిల్లాల్లో 22 మందికి కొవిడ్‌

ABN , First Publish Date - 2022-07-07T06:14:18+05:30 IST

ఇరు జిల్లాల్లో 22 మందికి కొవిడ్‌

ఇరు జిల్లాల్లో 22 మందికి కొవిడ్‌

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, జూలై 6: కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న కరోనా చాపకింద నీరులా వ్యాప్తిచెందుతోంది. ఈ క్రమంలో పదిరోజులుగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉమ్మడి జిల్లాలో 22మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 739మందికి పరీక్షలు నిర్వహించగా 18మందికి 

పాజిటివ్‌ రావడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన వార్డులో 100 పడకలను సిద్ధం చేశారు. ఇక భద్రాద్రి జిల్లాలో 1,038మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2022-07-07T06:14:18+05:30 IST