22,500 మంది భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించాం.. సుప్రీంకు తెలిపిన కేంద్రం
ABN , First Publish Date - 2022-03-22T02:46:51+05:30 IST
రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 22500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం తజాగా సుప్రీం కోర్టుకు తెలిపింది.
ఎన్నారై డెస్క్: రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 22,500 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం తజాగా సుప్రీం కోర్టుకు తెలిపింది. ఓ భారీ కార్యక్రమం దాదాపుగా పూర్తయ్యిందని పేర్కొంది. అయితే.. భారత్కు తిరిగొచ్చిన విద్యార్థులు తమ చదువు ఎలా కొనసాగించాలనే విషయంలో తమను సంప్రదించారని పేర్కొన్న కేంద్రం.. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలిపింది. ఉక్రెయిన్లోని భారతీయ విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగ పేరిట ఓ బృహత్ కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే.