23 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-06T04:36:20+05:30 IST

బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంపై వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కావలి ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

23 నుంచి ప్రసన్నుడి బ్రహ్మోత్సవాలు

బిట్రగుంట, మార్చి 5: బోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంపై వెలసి ఉన్న ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు  కావలి ఆర్డీవో శ్రీనివాసులు, ఎమ్యెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ పాలక మండలి చైర్మన్‌ శ్రీరాం మాల్యాద్రి, ఈవో రాధాకృష్ణల ఆధ్వర్యంలో శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వారు సమీక్షించి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి, తహసీల్దారు బాలమురళీకృష్ణ ఎంపీడీవో శ్రీరామమూర్తి, వైద్యులు నవీన్‌కుమార్‌, సీఐ అక్కేశ్వరావు, మాజీ పాలక మండలి చైర్మన్లు నగళ్ల శ్రీనివాస కిరణ్‌, రవీంద్రబాబు, వైసీపీ నేతలు కర్తం సురేంద్రరెడ్డితదితరులు పాలన్నారు.

Updated Date - 2021-03-06T04:36:20+05:30 IST